telugu navyamedia
క్రీడలు వార్తలు

రహానేను అదే విజయం వైపు నడిపిస్తుంది : ఇషాంత్

my best performance is my goal said ishanth

కరోనా లాక్ డౌన్ తర్వాత భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భారత్ నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ప్రస్తుతం తలపడుతుంది. అయితే అందులో భాగంగా జరిగిన మొదటి పింక్ టెస్ట్ లో టీం ఇండియా ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ తర్వాత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో తిరిగి భారత్ కు వచ్చేస్తున్నాడు. దాంతో మిగిత టెస్ట్ మ్యాచ్ లకు అజింక్య రహానే నాయకత్వం వహించనున్నాడు. ఈ విషయం పై భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ మాట్లాడుతూ రహానే బౌలర్ల కెప్టెన్ అని తెలిపాడు. రహానే లో ప్రశాంతత అలాగే ఆటగాళ్ల పైన అతను ఉంచే నమ్మకమే తనను విజయం వైపు నడిపిస్తుంది అని పేర్కొన్నాడు. కోహ్లీ లేని సమయంలో మేము కలిసి ఆడుతున్నపుడు… అతను నా వద్దకు వచ్చి అని వివరాలు అడిగేవాడు. నువ్వు ఏ బంతులు వేస్తావు… ఫిల్డింగ్ ఎలా సెట్ చేయాలి అనే విషయాలు తెలుసుకునేవాడు అని పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్ లో అయిన గాయం కారణంగా ఇశాంత్ ఈ టెస్ట్ సిరీస్ కు దూరమైన విషయం తెలిసిందే. మరి ఈ రెండో టెస్ట్ లో భారత్ ఏ విధంగా రాణిస్తుంది అనేది చూడాలి.

Related posts