telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆంధ్రప్రదేశ్​ మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారింది..

ఆంధ్రప్రదేశ్​ మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారిందని జనసేనాని అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

2018లో తన పోరాటయాత్రలో చాలా ఫిర్యాదులు వచ్చాయన్న పవన్‌.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పోరాటయాత్ర చేశానన్నారు.‘ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు’లోని గిరిజన ప్రాంతాలలో ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్, ‘గంజాయి వ్యాపారం తో పాటు గంజాయి మాఫియా’ గురించి తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.

అంతేకాకుండా హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీ రంగనాధ్ చేసిన వ్యాఖ్యల వీడియోను జనసేనాని ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నాయకులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని రంగనాధ్ మాటలతో అర్ధమవుతుంది’’ అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

Related posts