తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సంగారెడ్డి కాంగ్రెస్ మ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. సంగారెడ్డిలో సోమవారం ఆర్టీసీ కార్మికుల ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికులు శ్రీనివాస్ రెడ్డి, సురేంద్ర గౌడ్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు ఆర్టీసీ కార్మికుల ఆత్మ బలిదానం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఫోటోలకు పాలు పోసి పూజలు చేసిన ఆర్టీసీ కార్మికులే నేడు ఆయనను నిందించే పరిస్థితి రావడం విచారకమన్నారు. ఆర్టీసీ విలీనంపై రేపటికల్లా సీఎం కేసీఆర్ను ఒప్పించాలని రవాణా శాఖ మంత్ర పువ్వాడ అజయ్కుమార్ను డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని ఒప్పించకపోతే సంగారెడ్డి డిపోకు చెందిన 600 మంది కార్మికులతో హైదరాబాద్ తరలివచ్చి మంత్రిని ఘోరావ్ చేస్తానని హెచ్చరించారు. మంత్రి ఇంటిని ముట్టడించేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.