telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సత్యం కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయులు: మంత్రి ఐకె రెడ్డి

indrakaran reddy minister

సత్యం కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయులు గాంధీజీ అని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం గాంధీజీ 150 జయంతిని పురస్కరించుకొని నిర్మల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. శాంతి, అహింసే ఆయుధంగా బ్రిటిషర్లతో పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అనీ, ఆయన చూపిన పోరాట మార్గం మ‌నంద‌రికీ ఆదర్శనీయ‌మ‌ని మంత్రి అన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిన గొప్ప వ్యక్తి గాంధీ అనీ కొనియాడారు.

Related posts