telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు వైఎస్సార్‌ వర్థంతి.. కుటుంబ సభ్యుల నివాళులు

ys jagan

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని ఈ రోజు జగన్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వారితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో వారంతా కలిసి పాల్గొన్నారు. వైఎస్సార్ వర్థంతిని సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు నివాళులు అర్పిస్తున్నారు.

Related posts