telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టిమ్స్ లో వసతులపై కిషన్‌రెడ్డి అసంతృప్తి

Kishan Reddy

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టిమ్స్ లో వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరముందన్నారు. కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్‌ను వేగంగా అమలు చేయాలని సూచించారు.

కొవిడ్‌-19ని కట్టడి చేస్తున్న ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత సర్కారుదేనన్నారు. ఈ నెలలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా బారిన పడిన వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలని ఆయన చెప్పారు. దేశంతో పాటు రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని పెంచాల్సిన అవసరముందన్నారు.

Related posts