ప్రభాస్ ఫ్రెండ్, యూవీ క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన వంశీ తండ్రి, సినీ నిర్మాత, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన కొంతకాలంగా వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గుండెపోటుతో మరణించగా అంత్యక్రియలను ఆయన స్వస్థలమైన ఈదగాలిలో నిర్వహించారు. వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంత్యక్రియలకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, శర్వానంద్ హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం ఈదగాలిలో ఈ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు రామ్ చరణ్ వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు అధిక సంఖ్యలో ఆ ప్రదేశానికి చేరుకున్నారు. చెర్రీ, శర్వా రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, ప్రభాస్ చాలాకాలంగా ఫ్రెండ్స్. డార్లింగ్తో ‘సాహో’ వంటి ప్యాన్ ఇండియా సినిమాను నిర్మించారు వంశీ, ప్రమోద్.
previous post