చిత్ర పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. టాలీవుడ్ లో పలువురు తారలకు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది. నటి మంచు లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
‘రెండేళ్ల నుంచి బూచోడు లాంటి కరోనా వైరస్ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాను..గో కరోనా గో అని గట్టిగా అరిచినా కూడా అది తనను పట్టుకుందని తెలిపింది.దాంతో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ దానికి వేరే ప్లాన్ ఉంటుంది కదా. అందుకే నన్ను విడిచిపెట్టలేదు.
ప్రస్తుతం కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకు ఉన్న కలరీ స్కిల్స్తో దాన్ని ఎలాగైనా దూరంగా పంపిస్తాను’ అని రాసుకొచ్చింది మంచు లక్ష్మి.
‘అందరూ ఇంట్లో సురక్షితంగా ఉండండి. మాస్కులు తప్పనిసరిగా ధరించండి. వ్యాక్సిన్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకొనిఉంటే.. బూస్టర్( మూడో డోస్) కూడా తీసుకునేందుకు ప్రయత్నించండి. అలాగే టైమ్ పాస్ కోసం టాప్ 3 మూవీస్, షోలు, పాడ్కాస్ట్లు ఉంటే వివరాలు కొన్ని పంపించండంటూ నెటిజన్ల సలహా కోరింది