telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మంత్రి కేటీఆర్ వ్యాఖ్య‌ల‌ను ఏకీభవిస్తున్నా- ఆధారాల‌తో సీపీఐ నేత నారాయణ

పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవు… రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి’ అని మంత్రి కేటీఆర్… ఏపీపై చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు.

క్రెడాయ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్​ శుక్రవారం ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ పరోక్షంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అయితే  కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై వైసీపీ నేతలు నుంచి కూడా గట్టిగానే రియాక్షన్ కనిపించింది. ఈ తరుణంలో, సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాత్రం కేటీఆర్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నాన‌ని అన్నారు.

స్వయానా ఆంధ్రా- తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు. అనంతరం ఆంధ్ర రోడ్ల యొక్క స్థితిగతులను తమిళనాడు రాష్ట్రం యొక్క స్థితిగతులను ఆధారాలతో సహా వివరించారు.

తమిళనాడులో రోడ్లు బాగున్నాయని.. ఏపీలో మాత్రం గుంతలమయమన్నారు. తన స్వగ్రామం అయినంబాకం వెళ్లే రోడ్ల పరిస్థితిని నారాయణ వివరించారు.

Related posts