telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబుపై మార్షల్స్‌ చేయి వేశారు: అచ్చెన్నాయుడు

ache Naidu tdp

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు వాడివేడిగా సాగుతున్నాయి. గురువారం ఉదయం అసెంబ్లీ వెలుపల మార్షల్స్ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అసెంబ్లీ ఎదుట జరిగిన ఘటనలను అచ్చెన్నాయుడు సభలో ప్రస్తావించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పై మార్షల్స్‌ చేయి వేశారని ఆరోపించారు. గేటు దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్లకార్డు, బ్యానర్‌, నల్ల బ్యాడ్జీలు వద్దని చెబితే తీసేశామని.. అసెంబ్లీలోకి కాగితాలు కూడా తీసుకెళ్లొద్దని ఆదేశిస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేతిలో చిన్న తెల్లకాగితం ఉన్నందుకు 40 నిమిషాలు బయట నిలబెట్టారని అన్నారు. .టీడీపీ ఎమ్మెల్యే పట్ల మార్షల్స్‌ దారుణంగా ప్రవర్తించారన్నారు. ప్రతిపక్ష నేత చేయి పట్టుకుని లాగేశారని తెలిపారు.

సభ మధ్యలో కల్పించుకున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అసెంబ్లీలోకి ప్లకార్డులు, బ్యానర్లు తీసుకురావద్దని.. టీడీపీ హయాంలోనే రూల్స్‌ తీసుకొచ్చారని తెలిపారు. మార్షల్స్‌నే టీడీపీ సభ్యులు తోసివేశారని ఆరోపించారు. టీడీపీ సభ్యుల తీరుపైనే మార్షల్స్‌ ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

Related posts