telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

చినజీయర్ స్వామిని ఫోన్ లో పరామర్శించిన జగన్

cm jagan ycp

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌ స్వామిని ఏపీ సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. చినజీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) కన్నుమూసిన సంగతి తెలిసిందే. మాతృవియోగం పొందిన చినజీయర్ స్వామికి ప్రముఖుల నుంచి పరామర్శలు అందుతున్నాయి.

ఈ ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి పరామర్శించారు.ఈ క్రమంలో సీఎం జగన్ చినజీయర్ స్వామికి ఫోన్ చేశారు. చినజీయర్ తల్లి మరణించడం పట్ల తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

తల్లి మంగతాయారు అంటే ఎంతో అభిమానం చూపే చినజీయర్ ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. తల్లితో అనుబంధాన్ని గుర్తు చేసుకుని విచారానికి లోనయ్యారు. 

Related posts