telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమెరికా పర్యటనలో ఏపీసీఎం … రాయబారి ప్రశంసలు..

Indian Ambassador to America on apcm

ఏపీసీఎం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగానే జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. తాజాగా, వాషింగ్టన్ డీసీలో అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ ఏపీ సీఎం జగన్ కు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ నాయకత్వం అమోఘమని అభివర్ణించారు.

అభివృద్ధి పట్ల జగన్ సంకల్పం, స్థిరమైన వైఖరి, పాలనలో పారదర్శకత రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నాయని అన్నారు. జగన్ పనితనం పెట్టుబడులను ఆకర్షిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో అమెరికాలో భారత దౌత్య అధికారులు ఎంతో కృషి చేశారని కొనియాడారు.

Related posts