telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

రేపటి నుంచి సిటీ బస్సులు పున:ప్రారంభం!

AP city bus

కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించిన మార్చి నెల నుంచి ఆంధ్రప్రదేశ్ లో సిటీ బస్సులు నిలిచిపోయాయి. ఇక రేపటి నుంచి తిరిగి సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో శనివారం నుంచి ఆర్టీసీ సిటీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అనుమతించింది.

దీంతో ఆర్టీసీ అధికారులు బస్సులను నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బస్సుల్లో భౌతిక దూరం తప్పనిసరని, ప్రయాణికులు దూరదూరంగా ఉండి ప్రయాణించే ఏర్పాట్లు చేశామనిఅధికారులు వెల్లడించారు.

తొలి దశలో పరిమిత సంఖ్యలోనే బస్సులు నడుస్తాయని తెలిపారు. తదుపరి పరిస్థితిని మరోసారి సమీక్షించి, బస్సుల సంఖ్యను పెంచుతామని అధికారులు వెల్లడించారు.

Related posts