telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కరోనా కల్లోలం : మరో మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం!

చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. అంతే కాదు ఈ కరోనా బారిన పడి చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. ఈ కరోనా మహమ్మారి భారత క్రికెటర్ల ఇళ్ళల్లోనూ విషాదం నింపుతోంది. ఇప్పటికే టీం ఇండియా మాజీ క్రికెటర్ పియూష్‌ చావ్లా, ఆర్పీ సింగ్ లు తమ తండ్రులను కరోనాతో కోల్పోగా.. తాజాగా టీం ఇండియా మహిళా క్రికెటర్ ప్రియా పునియా తల్లి కరోనా సోకి మృతి చెందింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియా పునియా పేర్కొంది. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని ప్రియా పునియా ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లే తన మార్గదర్శి అని, జీవితంలో కొన్ని నిజాలను అంగీకరించక తప్పదని పేర్కొంది ప్రియా పునియా. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ.. చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె తెలిపింది.

Related posts