telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ ఠాకూర్

ఈస్టర్ పర్వదినం నాడు శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇస్లామిక్ తీవ్రవాదులు జరిపిన పేలుళ్లలో సుమారు 350 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. కొందరు ఇస్లామిక్ తీవ్రవాదులు దేశంలోకి చొరబడ్డారంటూ కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఉగ్రవాదులు తూత్తికుడి, కన్యాకుమారి తీరం గుండా భారత్‌లోకి ప్రవేశించారని ఐబీ దక్షిణాది రాష్ట్రాలను హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరంగా ఉండాలని, వాహనాలు, హోటళ్లలో తనిఖీలు పెంచాలని సూచించారు. ఈ నెల 23న ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి కూడా ఆయన జిల్లా ఎస్పీలకు పలు సూచనలు చేశారు.

 

Related posts