telugu navyamedia
క్రీడలు రాజకీయ వార్తలు

వచ్చే నెలలో భారత్‌-బంగ్లా మ్యాచ్‌.. ఇరు దేశాల ప్రధానులకు ఆహ్వానం!

Bangladesh Sheikh Hasina Modi

వచ్చే నెలలో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య టెస్టు మ్యాచ్ సిరీస్ జరగనుంది. వచ్చేనెల 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు ప్రధాని నరేంద్ర మోడి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాలకు క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ (క్యాబ్‌) ఆహ్వానం పంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుంది.

ఇందులో బంగ్లాదేశ్‌ ఆడడం ఇది తొలిసారి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో ఇరు దేశాల ప్రధానులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సమాచారం.క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈడెన్‌లో గంట కొట్టి మ్యాచ్‌ ప్రారంభించే పద్ధతిని ఆయన ప్రవేశపెట్టాడు.

Related posts