వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపునకు రంగం సిద్ధమైనట్టే. ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దీనిపై వివరణ కోరగా.. ఈసీ ఆ వివరాలను వెల్లడించింది. అసెంబ్లీ సీట్ల పెంపుపై ఏప్రిల్లోనే ఈసీకి కేంద్ర ప్రభుత్వం నోట్ పంపింది. అయితే కేంద్రం పంపిన నోట్ సరిగా లేదంటూ.. సరైన సమాచారంతో మరోసారి పంపాలని హోంశాఖను ఈసీ కోరింది.
ఇప్పటికే అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర న్యాయశాఖ, హోంశాఖలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తాజాగా పునర్విభజనకు సంబంధించి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒక కమిషన్ను కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా సీట్ల సంఖ్య ఏపీలో 225, తెలంగాణలో 151కి చేరుకోనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.