telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అచ్చెన్న విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అచ్చెన్నాయుడి విషయంలో మానవ హక్కులు ఉల్లంఘించడంతో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించారని మండిపడ్డారు. ఒక వ్యక్తి శస్త్రచికిత్స చేయించుకుంటే అతడిని ఎలా అరెస్ట్ చేయాలన్న దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆరోపించారు.

కావాలనే అచ్చెన్నాయుడి విషయంలో భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించిందని తెలిపారు. మీవి పద్ధతిలేని రాజకీయాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఆపరేషన్ జరిగిందని అచ్చెన్నాయుడు చెప్పినప్పటికీ 600 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చారు. దాంతో గాయం తిరగబెట్టింది. రెండోసారి కూడా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రిలోనూ డ్రామాలు ఆడారు. తనకు అనారోగ్యంగా ఉందన్నా గానీ, కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉంచినా గానీ, డిశ్చార్జి చేశారని విమర్శించారు.

Related posts