telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ప్రేమ పేరుతో ఆరుగురు యువతులను మోసం చేసిన వివాహితుడు…

ఆరుగురు యువతులను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు దండుకున్నాడు ఓ వివాహితుడు.. ఫేస్బుక్ లో పరిచయం ఆపై ప్రేమ పెళ్లితో లొంగదీసుకోవడం చేస్తున్నాడు. అంతేకాక  పెళ్లి చేసుకున్న భార్యను వదిలించుకోవడానికి వేదింపులకు గురిచేశాడు. అయితే చందానగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన కుర్ర విజయభాస్కర్ పై అతని భార్య సౌజన్య ఫిర్యాదు చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు లో ఈ కేసు నమోదయ్యింది. సౌజన్య ను 2017 జూన్ లో వివాహం చేసుకున్నాడు కుర్ర విజయభాస్కర్. అనంతరం మేనకోడలు పై విజయభాస్కర్ కన్నేశాడు. దాంతో అత్తింటివారు అంతా కలిసి సౌజన్యకు వేదింపులకు గురిచేసారు. ఈ తరుణంలోనే విజయభాస్కర్ ప్రేమాయాణాలు బయటపడుతున్నాయి.  భార్య ఉండగా మరో ఇద్దరికి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆంధ్రా అమ్మాయిలు హైదరాబాద్ సాఫ్ట్ వేర్ లనే తన టార్గెట్ గా పెట్టుకున్నాడు. అయితే నమ్ముకుని వస్తే జీవితాన్ని నాశనం చేశాడని భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన దగ్గరి నుండి 25తులాల బంగారం, 15 లక్షల కట్నం తీసుకున్నాడని తెలిపింది. తనకు మూడేళ్ల బాబు ఉన్నాడని, ఎలాగైనా న్యాయం చేయాలని పోలీసులను భార్య సౌజన్య కోరుతుంది. గతంలో 25 ఏళ్ల అమ్మాయిని మోసం చేసిన అనంతరం విజయభాస్కర్ ను అమ్మాయి తరపున బందువులు కాళ్లు మొక్కించారు. అప్పుడు మళ్లీ‌ ఇలాంటి‌మోసాలు చేయనని పెళ్లి అయ్యాక వేరే అమ్మాయిలకి లవ్ ప్రపోజ్ చేస్తూ ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు.

Related posts