telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మూడు శాఖల సిబ్బందిపై సీఎం జగన్ ప్రశంసలు

cm jagan on govt school standardization

ఆంధ్రప్రదేశ్ లో కరోనా నియంత్రణకు ముందు వరుసలో నిలిచి పోరాడుతున్న వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులపై సీఎం జగన్ ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, సహాయకచర్యలపై ఆయన ఓ వీడియో సందేశం అందించారు.

వైద్య ఆరోగ్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి మరింత ప్రోత్సాహం అందించే చర్యల్లో భాగంగా పూర్తి జీతం ఇస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో కష్టమైనా కూడా వారికి అండగా నిలవాలని నిర్ణయించామని తెలిపారు. ఇక ఇతర ఉద్యోగులకు జీతాలు వాయిదా వేశామని తెలిపారు. ఈ విషయంపై ఆయా శాఖలతో చర్చించి వారి అంగీకారం కూడా తీసుకున్నట్టు తెలిపారు.

Related posts