telugu navyamedia
క్రైమ్ వార్తలు

సంగారెడ్డిలో హైదరాబాద్ ఐఐటీకి విద్యార్థి ఆత్మహత్య..

హైదరాబాద్‌ ఐఐటీకి చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు .సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లిలో ఓ లాడ్జ్ నుంచి కిందకు దూకి మేఘ కపూర్(22) అనే ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

గత నెలలో హైదరాబాద్ ఐఐటీలో కపూర్ 3 నెలల క్రితం బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. నెల రోజులుగా లాడ్జ్‌లోనే ఉన్న కపూర్… ఈరోజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి విద్యార్థి మేఘ కపూర్ స్వస్థలం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ గ్రామం.

సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

Related posts