telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం..11మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం

Road accident 8 dead and 30 injured

అయ్యప్ప భక్తులు శబరిమలై నుంచి తిరుగు ప్రయాణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని నిపుదుకొట్టై దగ్గర రోడ్డు పై వెళ్తున్న లారీని అయ్యప్పభక్తుల టెంపో ట్రావెలర్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11మంది మృతిచెందగా, మరో ఐదుగురు అయ్యప్ప భక్తులకు తీవ్రగాయాలయ్యాయి.

మృతిచెందిన అయ్యప్ప భక్తులు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా షాలీపేట వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని నాగరాజు(35), మహేష్‌(28), కుమార్‌(22), శ్యామ్‌(22), ప్రవీణ్‌(22), సురేష్‌(25), కృష్ణ(35), సాయి(22), ఆంజనేయులు (25)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను తెలంగాణకు పంపేందుకు తమిళనాడు సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది.

Related posts