telugu navyamedia
రాజకీయ వార్తలు

చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడతాం: అమిత్ షా

amith shah bjp

దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారు ఎక్కడున్నా వదలబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గువహటిలో జరిగిన నార్త్ ఈస్ట్ డెమోక్రాటిక్ అలయెన్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ పౌర జాబితా పట్టిక కేవలం అసోం వరకే పరిమితం కాదని షా స్పష్టం చేశారు. చొరబాటుదారులెవరూ అసోంలో జీవించలేరని స్పష్టం చేశారు.

చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడతామని, అక్రమంగా నివసిస్తున్నవారు ఎక్కడున్నా వదలబోమని తేల్చిచెప్పారు. అసలు దేశంలోని ఏ ప్రాంతంలో కూడా చొరబాటుదారులకు చోటు ఉండదనిఅన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి బీజేపీ చేరువకావాలని షా అన్నారు.

Related posts