అనుమానాస్పద రీతిలో హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ మరణించారు. ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఢిల్లీలోని తన నివాసంలో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించారు. ఈ కేసును అనుమానాస్పద కేసుగా నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎంపీ మృతి పట్ల అటు బీజేపీ అధిష్టానం సంతాపం తెలిపింది. ఈరోజు జరగాల్సిన బీజేపీ పార్లమెంటరీ మీటింగ్ ను వాయిదా వేసుకుంది. ఈరోజు ఉదయం 7:45 ప్రాంతంలో ఎంపీ స్వరూప్ పర్సనల్ అసిస్టెంట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎంపీ తన గదిలో డోర్ లాక్ చేసుకొని ఉన్నారని, ఎంతసేపు డోర్ తట్టినా ఎలాంటి సమాధానం రావడం లేదని చెప్పి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్వరూప్ ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టారు. అప్పటికే అయన ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇక గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇలా ఉన్న పలంగా ఆయన మరణించడం… అది కూడా ఇంట్లో ఫ్యాన్ కు వేళ్ళాడుతూ ఉండటం చాలా అనుమానాలను తావిస్తోంది.
previous post
next post
వైసీపీ రౌడీలు మరో అడుగు ముందుకేశారు: నారా లోకేశ్