*అభిమాని ఫ్యామిలీతో కలిసి బాలయ్య భోజనం
*కొండా రెడ్డి బురుజు దగ్గర శవయాత్ర షూటింగ్ చిత్రీకరణ
*కర్నూలు నడిబొడ్డున బాలయ్య సినిమా షూటింగ్
అఖండ సూపర్ హిట్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా ఎన్బీకే 107. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బురుజు దగ్గర జరుపుకుంటుంది.
కర్నూలు లో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య.. తాజాగా చేసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం కర్నూలు సిటీలోనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సోమవారం చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను కొండా రెడ్డి బురుజు, మరియు ఇతర లొకేషన్లలో చిత్రీకరించారు
అయితే కర్నూలు జిల్లా వెళ్లిన బాలకృష్ణ స్వయంగా అభిమానికి ఫోన్ చేశారు. ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు N.సజ్జాద్ హుస్సేన్ కు బాలయ్య బాబు ఫోన్ చేశారు.
తన దగ్గరకు వచ్చిన అభిమాని కుటుంబానితో కలిసి బాలకృష్ణ భోజనం చేశారు. తమ అభిమాన హీరో బాలయ్యతో కలిసి కొంతసేపు గడపడం.. భోజనం చేయడంతో సజ్జాద్ హుస్సేన్ ఫ్యామిలీ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. బాలకృష్ణ ఈ చిత్రంలో రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తుండగా, రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రచిస్తున్నారు
తాజ్ మహల్ ఒక సమాధి… ప్రపంచ వింతకాదు… రంగోలి రనౌత్ కామెంట్స్