telugu navyamedia
సినిమా వార్తలు

ఆమెపై ఉమ్మేస్తే జనాలు నాపై ఉమ్మేస్తారు… అయినా ఉమ్మేశా… : నాగశౌర్య

Nagashourya-with-Samantha

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కించారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేశారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ నెల 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సినిమా అంచ‌నాల‌ను అందుకుంటూ ఘ‌న విజ‌యంగా నిలిచింది. ఎమోష‌న‌ల్‌తో పాటు ప‌లు కామెడీ సన్నివేశాల‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తుంది. ఈ సినిమాలో సమంత నటనకు సినీ అభిమానులే కాక సెల‌బ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు నాగశౌర్య. ఈ సినిమాలో నాగశౌర్య ముఖ్య పాత్రలో పోషించారు. అతిథి పాత్ర కోసం అతడిని తీసుకున్నప్పటికీ సెట్ లోకి వెళ్లిన తరువాత ఫుల్ లెంగ్త్‌ రోల్ అయిందని చెప్పాడు నాగశౌర్య. హీరోగా చేస్తూ అతిథి పాత్రలు చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చాడు. నందినీ రెడ్డి మొదట కథ చెప్పడానికి సందేహిస్తుంటే.. తన తల్లి ఒత్తిడి చేసి తనకు నందిని రెడ్డితో కథ చెప్పించిందని.. కథ వినగానే తప్పకుండా హిట్ అయ్యే సినిమా అవుతుందని.. అందులో భాగం కావాలని సినిమా ఒప్పుకున్నట్లు చెప్పాడు. సమంత గారితో కలిసి పని చేస్తున్నప్పుడు ఓ పెద్ద హీరోయిన్ తో కలిసి పని చేస్తున్నానని అనిపించలేదని.. ఆమె సెట్ లో చాలాసింపుల్ గా ఉంటారని చెప్పుకొచ్చారు. అయితే సినిమాలో సమంతపై ఉమ్మివేసే సీన్ ఒకటుందని.. నిజంగా సమంతపై ఉమ్మేస్తే.. జనాలు తన మీద ఉమ్మేస్తారని అనుకున్నాడట శౌర్య. కానీ సమంత ఎంతో డెడికేషన్ తో పని చేస్తుందని.. సినిమా కోసమే కదా అని సహకరించడంతో ఆ సీన్ చేసినట్లు వెల్లడించాడు.

సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మీ తనకు ఎంతో ఇష్టమైన నటి అని, అందుకే ఈ చిత్రంలో తనది అతిథిపాత్ర అని చెప్పినా చేేసేందుకు అంగీకరించానని అన్నాడు. లక్ష్మీ గారు సెట్లో ఉన్నప్పుడు ఒక రోజు మొత్తం సమంత గారు, నేను అక్కడే ఉన్నాం. నేను ఒక్కసారి ఆమెను పలకరించానని, ఆ తర్వాత దూరం నుంచి ఆమెను చూస్తూ నిలబడ్డానని చెప్పుకొచ్చాడు. తనకు సిగ్గు ఎక్కువ అని చెప్పిన నాగశౌర్య, చాలామంది దాన్ని పొగరు అనుకుంటుంటారని అన్నాడు. తన సిగ్గు వల్ల రొమాంటిక్ సీన్స్ కు దూరంగా ఉంటున్నానని, తప్పని పరిస్థితుల్లోనే ఆ సీన్స్ లో నటిస్తానని చెప్పాడు.

తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఐరా క్రియేషన్స్ లో ‘అశ్వత్థామ’ సినిమా చేస్తున్నట్లు చెప్పారు. అలానే అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’ సినిమా , ‘పారదు’ అనే మరో సినిమా కూడా జరుగుతోందని చెప్పుకొచ్చారు నాగశౌర్య.

Related posts