అక్కినేని హీరో అఖిల్ నటించిన “అఖిల్”, “హలో”, “మిస్టర్ మజ్ను” మూడు చిత్రాలూ ఆయనకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ చిత్రాల తర్వాత అక్కినేని అఖిల్ కథానాయకుడుగా నటిస్తోన్న నాలుగో సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో జి.ఎ 2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీవాసు, వాసువర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గత రాత్రి తమిళ హీరో శివకార్తికేయన్, దర్శకుడు మిత్రన్, జార్జిలని హైదరాబాద్లో తన ఇంటికి డిన్నర్కి ఆహ్వానించాడు అఖిల్. ఆ తర్వాత కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా శివకార్తికేయన్, మిత్రన్ కాంబినేషన్లో చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తుంది.
Akhil Akkineni hosted Sivakarthikeyan, Mithran & George for Dinner at Hyderabad last night. @AkhilAkkineni8 @Siva_Kartikeyan @Psmithran @george_dop pic.twitter.com/5Lnq35nFE0
— BARaju (@baraju_SuperHit) 16 October 2019