నేడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్చి త్రైమాసికానికి ఫలితాలను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 22.63శాతం నికర లాభాల్లో వృద్ధి కనిపించింది. ఈ సీజన్లో రూ.5,805 కోట్ల లాభాన్ని విశ్లేషకులు అంచనా వేయగా అది రూ.5,885.12 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే సీజన్లో రూ.4,799.28 కోట్ల లాభాన్ని ప్రకటించింది.
కేవలం వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయమే 22.8శాతం పెరిగి రూ.13,089 కోట్లకు చేరింది. గత త్రైమాసికంతో నిఖర వడ్డీ మిగులు రూ.4.4శాతానికి చేరింది. కాకపోతే మొండిబకాయిల ప్రొవిజన్లు కూడా రూ.1,541 కోట్ల నుంచి రూ.1,889 కోట్లకు పెరిగాయి.