కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. కరోనా కలకలం సద్దుమణిగాక క్రీడారంగంలో పెనుమార్పులు వస్తాయని భావించడంలేదని అన్నారు. అయితే సాధారణ ప్రజల తరహాలోనే ఆటగాళ్లు కూడా కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందన్నారు. స్వల్ప మార్పులు తప్ప క్రీడారంగం మునుపటిలానే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
క్రికెట్ బంతిపై బౌలర్లు ఉమ్మి పూసి రుద్దడం ద్వారా మెరుగు తీసుకువచ్చేవారని, ఇప్పుడా అవకాశం ఉండకపోవచ్చని అన్నారు. ఉమ్మికి ప్రత్యామ్నాయంగా ఐసీసీ ఏదైనా కృత్రిమ పదార్థాన్ని అందించాలని గంభీర్ సూచించాడు. క్రికెట్ లో భౌతిక దూరం పాటించడం సాధ్యమేనని పేర్కొన్నారు. ఇతర క్రీడల్లోనే ఏదైనా మార్గం ఆలోచించాలని తెలిపారు. హాకీ, ఫుట్ బాల్ వంటి ఆటల్లో భౌతికదూరం పాటించడం కష్టసాధ్యమైన విషయం అని అభిప్రాయపడ్డాడు.
టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు: బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్రావు