నిజామాబాద్లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ ఆసుపత్రి గదిలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చని కామాంధుల పైశాచికత్వానికి ఎంతో మంది మహిళలు బలవుతున్నారు. ఒంటరిగా కనిపిస్తే రక్షణనివ్వాల్సింది పోయి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మానవత్వాన్ని మరిచిపోయి… వారి పశువాంఛను తీర్చుకునేందుకు యత్నిస్తున్నారు. చిన్నారులు, బాలికలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుస అత్యాచార ఘటనలు మానవ మృగాల ఆకృత్యాలకు అదుపు లేకుండా పోవడాన్ని చాటుతున్నాయి.
వివర్లాలోకి వెళితే..
నిజామాబాద్లో యువతిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి మద్యం తాగించి… దారుణానికి ఒడిగట్టారు. ఓ ఆసుపత్రి గదిలోకి తీసుకెళ్లి సాముహిక అత్యాచారం చేశారు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది 100కి ఫిర్యాదు చేశారు.అక్కడకు చేరుకున్న పోలీసులు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం… ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం… పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు భద్రత లేకపోవడంపై ఆందోళనకు గురవుతున్నారు.