telugu navyamedia
క్రైమ్ వార్తలు

కామారెడ్డి జిల్లాలో తీవ్ర‌ విషాదం..విద్యుత్ షాక్‌ త‌గిలి నలుగురు మృతి

*కామారెడ్డి జిల్లాలో తీవ్ర‌ విషాదం
*విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి..మృతులో ఇద్ద‌రు చిన్నారులు 
*మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన‌వారిగా గుర్తింపు

కామారెడ్డి జిల్లాలో తీవ్ర‌ విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృతి చెందారు. స్థానిక బీడీ వర్కర్స్ కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది.

చనిపోయిన వారిని హైమద్, పర్వీన్, మాహిమ్, అద్నాన్ గా పోలీసులు గుర్తించారు.వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. మృతుల్లో భార్యభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

గ‌త కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో బట్టలు ఆరవేసేందుకు ఇంట్లోనే జే వైర్ కట్టారు. ఇంట్లో మొద‌ట పిల్ల‌ల‌కు విద్యుత్ వైర్ త‌గిలింది. వారిని ర‌క్షించే ప్ర‌య‌త్నంలో త‌ల్లిదండ్రులిద్ద‌రూ ప్రమాదానికి గురైన‌ట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Related posts