హైదరాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడ ఫేజ్ -4లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫేజ్-4లోని హైటెక్ అలుకాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే… ఈ రోజు ఎన్నికల పోలింగ్ సందర్భంగా సెలవు దినం కావడంతో కార్మికులెవరూ లేరు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో కంపెనీకి రావడంలో మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే.. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల వరకు ఆస్థి నష్టం జరిగి ఉండొచ్చని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనికి గల కారణాలు తెలుసుకునే పనిలో యాజమాన్యం పడిపోయింది.
previous post
కవిత ఓటమికి కారణాలు వివరించిన కేటీఆర్