సికింద్రాబాద్ రైల్ నిలయం ఏడో అంతస్తులో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా చెలరేగడంతో ఫర్నిచర్ తో పాటు పలు పత్రాలు దగ్ధమయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అగ్నిమాపకశాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ ఆసిఫ్నగర్ పరిధిలోని జిర్రాలో కూడా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నీచర్ గోదాంలో నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
previous post