సెల్ఫీ పిచ్చి రోజురోజుకు ఎంత ముదురుతుందో తెలియనివిషయం కాదు. సెల్ఫీ మోజులో ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. అయినా యువతలో మార్పు కొంచం కూడా రావడం లేదు. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి ఒడిశాలో జరిగింది. అయితే, ఈసారి ప్రాణాలు పోలేదు కానీ.. సెల్ఫీ తీసుకున్న యువకుడిని మాత్రం పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
బర్గఢ్కి చెందిన కొందరు యువతీ యువకులు ఓ నాగుపాముతో సెల్ఫీలు దిగారు. అక్కడితో ఆగక రోహిత్ అనే యువకుడు దానితో ఆటలాడాడు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ అయి వన్యప్రాణి సంరక్షణ అధికారుల దృష్టికి చేరాయి. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రోహత్ను అరెస్ట్ చేశారు.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై దత్తాత్రేయ ఫైర్