తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెన్నై సమీపంలోని మాధవరంలో ఆయిల్ తయారీ కేంద్రంలో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటనలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ అగ్నిప్రమాదం కావడంతో స్థానికలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.