telugu navyamedia
వార్తలు సామాజిక

మహారాష్ట్ర నుంచి సిద్ధిపేట చేరుకున్న విద్యార్థులు

students college

ఉన్నత చదువులకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన తెలుగు విద్యార్థులు లాక్ డౌన్ కారణంగా అనేక రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు వీరందరినీ తీసుకువచ్చేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుం బిగించాయి. తాజాగా, మహారాష్ట్ర నుంచి 17 మంది తెలుగు విద్యార్థులు సిద్ధిపేట చేరుకున్నారు.

అగ్రికల్చర్ ట్రైనింగ్ కోసం 7 జిల్లాలకు చెందిన 42 మంది విద్యార్థులు మహారాష్ట్ర వెళ్లారు. వీరి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం కావడంతో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మహారాష్ట్ర అధికారులతో మాట్లాడారు. దాంతో 17 మంది అగ్రికల్చర్ విద్యార్థులను ప్రత్యేక బస్సులో తరలించారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించి, అనంతరం హోం క్వారంటైన్ విధించనున్నారు.

Related posts