పండుగా సీజన్ కదా.. ఆయా సంస్థల ఆఫర్లతో కళకళలాడుతున్నాయి. ఒకదానికి మించి మరొకటి ఆఫర్లు ఇస్తూ వస్తున్నాయి. ఈ కామర్స్ సైట్ లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో భారీ ఆఫర్లు కొనసాగుతున్నాయి. ఈసారి అయితే మరి దారుణం. మొన్నటికి మొన్న దసరా పండుగ సంధర్బంగా నాలుగు రోజులు సేల్ నిర్వహించాయి. ఇప్పుడు దీవాలి సేల్ అంటూ మళ్ళి ఆఫర్లు ఇవ్వడం మొదలు పెట్టాయి. దీంతో ప్రస్తుతం అన్ని ఫోన్ల ధర భారీగా తగ్గింది. అయితే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ఒప్పో తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒప్పో ఏ9 2020 స్మార్ట్ ఫోన్ పై భారీగా ధరను తగ్గించింది.
ఒప్పో 4జీబీ ర్యామ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ రూ. 16,990 ఉండగా 1000 రూపాయిల తగ్గుదలతో రూ. 15,990 చేరింది. ఒప్పో ఏ9 2020 8 జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ రూ. 19,990, 6.5 అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 665, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగాపిక్సెల్ మెయిన్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ షూటర్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఈ ఫోన్ లో ఉన్నాయి.