telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పింఛన్ల పంపిణీలో వైసీపీ నాయకులు రూ.50 లాక్కుంటున్నారు: నారా లోకేశ్

Minister Lokesh comments YS Jagan

ఏపీలో వృద్దాప్య, వితంతువులకు ప్రభుత్వం పంపిణీ చేసున్న పింఛన్లలో వైసీపీ నాయకులు రూ.50 లాక్కుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. చాలాచోట్ల చినిగిన పాతనోట్లను ఇస్తున్నారని దుయ్యబట్టారు. .ముఖ్యమంత్రి గారూ, ప్రతీనెలా 1వ తేదీనే అందుకునే పింఛను గత నెల వారం దాటాక ఇచ్చి, ఈ నెల సగమే ఇచ్చి అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారని ఈరోజు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

పింఛను రూ.వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చి రూ.250 మాత్రమే పెంచారు. ఈ రూ.250లో మీ వైసీపీ నాయకులు పెట్టిన హుండీలో రూ.50 వేయాలి. మిగిలిన సొమ్ముకి చిరిగిపోయిన నోట్లిచ్చి ముసలోళ్ల నోరు కొడుతున్నారు. నా పింఛను మొత్తం ఇవ్వలేదని అవ్వ అడుగుతోంది. చినిగిపోయిన నోట్లిచ్చి మోసం చేశారని తాత నిలదీస్తున్నాడని తీవ్రస్థాయిలో విమర్శించారు.

Related posts