తెలుగు దేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి చెప్పనక్కర్లేదు. 2019 లో అధికారం కోల్పోవడం… అతి తక్కువ సీట్లకే పరిమితమవడం ఆ పార్టీని ఇంకా దెబ్బ తీశాయి. పార్టీ పరిస్థితి చూసి ఒక్కో నేత వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఇందులో కీలక నాయకులూ ఉండటం విశేషం.. తాజాగా మరో కీలక నేత టీడీపీకి రాజీనామా చేశారు. ఉత్తరాంధ్ర టీడీపీలో కీలక మహిళనేతగా పేరొందిన ఆ పార్టీ విజయనగరం జిల్లా సీనియర్ నాయకురాలు. మాజీ మంత్రి పడాల అరుణ.. పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడికి పంపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పడాల అరుణ పనిచేశారు. 33 ఏళ్లుగా టీడీపీలో పనిచేసినా.. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పడాల అరుణ స్పష్టం చేశారు. అంతేకాదు.. ముహుర్తం చూసుకుని బీజేపీలో చేరతానని ఆమె పేర్కొంది.


రైతుల నిరసన పై సంచలన వ్యాఖ్యలు చేసిన రఘునందన్…