telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రజాగొంతుకనై మండలిలో పోరాడుతా: జీవన్‌రెడ్డి

Congress Jeevan Reddy Contest MLC

కరీంనగర్, నిజామాబాద్, మెదక్‌, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీ చేసిన గ్రూప్‌–1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్‌ గౌడ్‌పై 39,430 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడతానని ఆయన అన్నారు.

తనపై నమ్మకముంచి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. ప్రజాగొంతుకనై మండలిలో పోరాడుతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాల వ్యతిరేకతకు ఈ ఎన్నికలు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

Related posts