telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వెల్లంప‌ల్లికి మ‌రో చేదు అనుభ‌వం..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్న నాగ‌రాజు అనే యుకువ‌డు వెల్లంపల్లి కి బ‌హిరంగంగా నిల‌దీశారు.

ప్రభుత్వం 1500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఓ ఇంజనీర్ నిలదీశారు. దీంతో ఆవేశానికి లోనైన వెల్లంపల్లి.. ‘‘పిచ్చి పిచ్చిగా మాట్లాడకు..ఎవడో చెప్పింది విని మాట్లాడవద్దని ,నీ మీద కేసు పెట్టమంటవా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఐ గారు అతని మీద కేసు పెట్టండి. రూ. 1,500 కోట్లు అవినీతి చేశానని చెప్తున్నాడు. రుజువు చేయకపోతే అతడిపై కేసు పెట్టి లోపలేయండి. ఏం జరిగిందో నాకు చెప్పాలి. ప్రతి వాడికి ఇదో ఫ్యాషన్ అయిపోంది’’ అని వెల్లంపల్లి అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

Related posts