కాశ్మీర్ ఫైల్స్, గో రక్షకులపై చేసిన వ్యాఖ్యలపై సినీనటి సాయి పల్లవి స్పందించారు. ఒక డాక్టర్గా తనకు ప్రాణమే విలువైనదన్న ఆమె.. హింస ఎక్కడున్నా సమర్ధించేది లేదని ఆమె స్పష్టం చేశారు.
రానా దగ్గుబాటి , సాయిపల్లవి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ..‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో ఉగ్రవాదుల మారణకాండను, గోరక్షకులు ఓ ముస్లిం వ్యక్తిపై చేసిన దాడి గురించి ప్రస్తావిస్తూ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం తెలిసిందే.
దీనిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో చిత్ర బృందానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాయి పల్లవి వివరణ ఇచ్చారు.
ఇలా మీ ముందుకు వచ్చి ఒక విషయం మీద క్లారిటీ ఇవ్వడం ఇదే మొదటిసారి. నేను మాట్లాడిన మాటలు కొందరికి తప్పుగా అర్ధం చేసుకున్నారు.
వాస్తవానికి నేను హింస ఏదైనా హింస అనే చెప్పే ప్రయత్నం చేశాను. లెఫ్ట్, రైట్ వింగ్స్ గురించి మాట్లాడుతూ.. కశ్మీరీ ఫైల్, గోరక్షకుల దాడి అంశాలను ప్రస్తావించాను.
ఓ డాక్టర్గా ప్రాణం విలువ తనకు తెలుసునని.. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికీ లేదని సాయి పల్లవి స్పష్టం చేశారు.నా వ్యాఖ్యలు వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే క్షమించండి. ఇలాంటి పరిస్థితిలో నాకు సపోర్ట్ చేసినవారికి కూడా థాంక్స్’’ అని తెలిపింది.
నేను ఇచ్చిన ఇంటర్వ్యూను మొత్తం చూడకుండా, చిన్న క్లిప్ చూసి మీడియా నా వ్యాఖ్యలను ప్రచారం చేశారు. పూర్తిగా చూసి ఉంటే నేను అలా ఎందుకు మాట్లాడానో అర్థమయ్యేది. ఆ ఇంటర్వ్యూలో మీ మద్దతు రైట్ వింగ్కా, లెఫ్ట్ వింగ్కా అని అడిగారు. దానికి సమాధానంగా నేను.. వారికి వీరికి అని కాదు, మనం మంచి మనుషులా జీవించాలనే ఉద్దేశంతోనే ఆ ప్రస్తావన తీసుకొచ్చానని, విధ్వంసం ఏ రూపంలో వున్నా సమర్ధించనని ఆమె స్పష్టం చేశారు.
మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేయాలి… పీకేపై శ్రీరెడ్డి సంచలన పోస్ట్