telugu navyamedia
తెలంగాణ వార్తలు

యాదాద్రీశుని సన్నిధిలో ఎన్నికల అధికారి..

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర చీప్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శశాంక్ గోయల్ ను సాదరంగా స్వాగతించిన ఆలయాధికారులు స్వామివారి దర్శనం చేయించారు. స్వామివారి దర్శనం అనంతరం శశాంక్ గోయల్ కు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం దేవస్థానం అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు.

Related posts