ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ సోయగం రష్మిక మందన్నా జంటగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.. ఈ చిత్రంలో పుష్పరాజ్ ప్రేమలో పడే శ్రీవల్లి పాత్రలో నటించింది రష్మిక మందన్నా.
పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 17 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్లతో మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.
తాజాగా బెంగళూరులో నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రెస్మీట్ చెప్పిన టైంకి కాకుండా ఆలస్యంగా ఎలా వచ్చారంటూ ఓ కన్నడ రిపోర్టర్ అల్లు అర్జున్కి నిలదీశాడు.
11.15కి ప్రెస్మీట్ అనిచెప్పి1.15కి ఎలా వస్తారని, ఇక్కడ మీడియాను మీరు అవమానించినట్లే అని ఒక రిపోర్టర్ బన్నీ, రష్మికలపై ఓ రిపోర్టర్ ఫైర్ అయ్యాడు.
దీంతో మిమ్మల్ని ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి..ఇది ఎవరిని హార్ట్ చేయాలనీ చేయలేదు…పొగమంచు కారణంగా ఫ్లైట్ కాస్త ఆలస్యం అయ్యిందని అంతేకాకుండా ప్రెస్మీట్ టైమింగ్పై కాకుండా తనకు స్పష్టత లేదని చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా సారీ చెప్తే మనిషి పెరుగుతాడు కానీ తగ్గడు అని తనదైన స్టైల్ ల్లో బన్నీ తెలిపిన విధానం ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.