రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశాయి.
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన స్పృహలోనే ఉన్నారని, తనంతట తానే సాయిధరమ్ తేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు చెప్పిన డాక్టర్లు.. మరికొంతకాలం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. శరీరంలోని ముఖ్య భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇక తేజుకి ప్రమాదం జరిగినప్పటి నుంచి మెగా ఫ్యామిలీతో పాటు చిత్ర పరిశ్రమలో కూడా ఆందోళన చోటు చేసుకుంది.
నగరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో గత శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్పై ప్రయాణిస్తున్న బైక్పై ప్రయాణిస్తూ సాయితేజ్ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..
“రంగస్థలం” మిస్సయినందుకు బాధగా ఉంది : అనుపమ పరమేశ్వరన్