ప్రస్తుతం మన దేశంలో కరోనా మహామ్మారిని అరికట్టడానికి మే 3 వరకు లాక్డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజలు కొన్నాళ్లు నిర్భందంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు సినిమా నటులు అందరు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పటికే చాలా మంది నటీనటులు ఇదే సరైన సమయం అనుకొని తమకు నచ్చిన వాళ్లతో ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇప్పటికే కృతి కర్బందా, ఆమె ప్రియుడు పుల్కిత్ ఒకే ఇంట్లో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా టైగర్ ష్రాఫ్తో బ్రేకప్ సెప్పిన దిశా పటానీ మహారాష్ట్రకు చెందిన ఒక అగ్ర నాయకుడి కుమారుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. అతను ఇపుడు ఆ రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు. అప్పట్లో వీళ్లిద్దరు కలిసి తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా వీరిద్దరు లాక్డౌన్ సమయంలో ఒకే ఇంట్లో ఉంటూ ఈ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్టు సమాచారం.
previous post
10 వారాల పాటు హౌస్ లోనే గంగవ్వ… కౌశల్ ఆసక్తికర వ్యాఖ్యలు