ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇతర విషయాలపై దృష్టి పెడుతున్నారని అన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ఏపీలోని ఎనభై శాతం జిల్లాలు రెడ్ జోన్లు అని పేర్కొన్నారు.
దీనికి సంబంధిత శాఖ తెలియజేసిన వివరాలను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రజా ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన జగన్ రాజకీయ అంశాలపై దృష్టి సారిస్తున్నారని దుయ్యబట్టారు. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై జగన్ దృష్టి పెట్టకపోతే మానవ నిర్మిత విపత్తుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.