telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తనీష్ కు డ్రగ్స్ కేసులో నోటీసులు…

mahaprastanam movie with tanishq

టాలీవుడ్ హీరో తనీష్ కు పోలీసులు డ్రగ్స్ కేసుకు సంబంధించిన నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. బెంగళూరులోని బాణా సవ్వడి పోలీసులు ప్రస్తుతం ఒక కేసును విచారిస్తూ ఉన్నారు. ఆ కేసులో భాగంగా సినీ నటుడు తనీష్ తో పాటు మరో ఐదుగురు ఈ రోజు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఐదుగురు ఒక పారిశ్రామికవేత్త సినీ నిర్మాత కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ముందుగా ఒక నైజీరియన్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు వారు ఇచ్చిన సమాచారం మేరకు మస్తాన్, విక్కీ మల్హోత్రా అనే వ్యక్తులు పేర్లు బయటకు వచ్చాయి. మస్తాన్ ను పోలీసులు విచారించగా నిర్మాత శంకర్ గౌడ్ అనే పేరు వెలుగులోకి వచ్చింది. ఇక ఈ నిర్మాత ఆయన ఆఫీస్ లో మందు పార్టీలు ఎక్కువ ఇస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ పార్టీలకు చాలా మంది ప్రముఖులు హాజరయ్యే వారిని ఆ ప్రముఖులలో సినీ నటుడు తనీష్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయనను పోలీసులు ముందు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ అయ్యాయి. అయితే చూడాలి మరి దీని పై తనీష్ ఏ విధంగా స్పందిస్తాడు అనేది. అయితే గాథలో కూడా టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగిన విషయం తెలిసిందే.

Related posts