దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఇతర మోటారు వెహికల్ డాక్యుమెంట్ల గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ వెసులుబాటును వాహనదారులకు కల్పించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అభ్యర్థించింది.
ప్రభుత్వ రవాణా కార్యాలయాలు మూసివేయడం వల్ల వివిధ మోటారు వాహన పత్రాల చెల్లుబాటును పునరుద్ధరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సౌకర్యంగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. వాహనాల ఫిట్నెస్, పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్తో పాటు మోటారు వాహన నిబంధనల ప్రకారం జారీ చేయబడ్డ అన్ని పత్రాలకు ఈ గడువు వర్తించే అవకాశముంది.
బాలయ్య డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు: పోసాని