telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పెన్షన్ దారులకు గుడ్ న్యూస్…

Money

పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ అందించింది పోస్టల్ డిపార్ట్ మెంట్. ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన వారు ప్రతి ఏడాది ఈజీగా పెన్షన్ పొందవచ్చు. ప్రతి ఏడాది ఖచ్ఛితంగా పెన్షన్ పొందే బ్యాంకుకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది. సాధారణంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను నవంబర్ నెలలో అందించేవారు. కానీ ఈ సారి కరోనా కారణంగా డిసెంబరు వరకు జీవన్ ప్రమాణ్ పత్రాన్ని అందించవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే తాము జీవించి ఉన్నట్లు తెలిపితేనే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు నెలా నెలా పింఛన్ అందిస్తారు. తాజాగా ఆన్‌లైన్ ద్వారా, పోస్టాఫీసు ద్వారా, బ్యాంకుల ద్వారా వికలాంగులు, వృద్ధులు జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించి ప్రతినెలా ఏ ఇబ్బంది లేకుండా పింఛన్ పొందవచ్చు. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ పెన్షనర్ల కోసం ఇంటి వద్దకే లైఫ్ సర్టిఫికెట్ ను పొందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ సర్టిఫికెట్ కోసం రూ.70 చెల్లించాలని పోస్టల్ బ్యాంక్ వెల్లడించింది. వృద్ధులు, వికలాంగులకు ఈ సదుపాయం కల్పించింది. రూ.70 చెల్లించినట్లయితే పోస్టల్ శాఖ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికెట్ ను అందిస్తుంది. కేవలం ఐదు నిమిషాల్లోనే బయోమెట్రిక్ లైఫ్ సర్టిఫికెట్ ను జారీ చేస్తారు. సులభంగా మీరు పెన్షన్ పొందవచ్చు. ఇది పెన్షన్ దారులకు చాలా లాభం చేకూరుస్తుంది.

Related posts